జుట్టు ఎక్కువగా రాలి పోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణం లో మార్పులు, తినే ఆహారంలో పోషక విలువల లోపం, లావు తగ్గలనే తపన తో హఠాత్తుగా తినే ఆహారపు పరిమాణాన్ని తగ్గించడం, ఎక్కువగా పరిశ్రమించడం, గర్భిణీ గా ఉన్నప్పుడు, ప్రసవానంతరం, రక్త హీనత, టైఫాయిడ్, ఇతర జ్వరాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక రోగాలు, విటమిన్లు ఎక్కువగా తీసుకోవడం, క్యాన్సర్ చికిత్స లో ఉపయోగించే ఔషధాలు, చుండ్రు, వీటి వల్ల ఎక్కువ ప్రమాణం లో జుట్టు రాలుతుంది.

వెంట్రుకల పెరుగుదల లో మూడు దశలు ఉంటాయి. అవి ఏమిటంటే వృద్ధి అవస్థ, క్షీణ అవస్థ, మిశ్రమ అవస్థ. ఈ దశ లలో వెంట్రుకలు కొంత కాలం పెరుగుతూ అంటే ఒక్కక్క వెంట్రుక నెలకు 1-2 సెంటి మీటర్ పెరుగుతుంది. కొంత కాలం పెరుగుదల లో మార్పేమి లేకుండా తరువాత రాలి పోవడం జరుగుతుంది. మన శిరస్సు పై ఉండే వెంట్రుక లలో 80% వృద్ధి దశలోనూ, 20% మాత్రమే విశ్రాంతి లేదా క్షీణ దశ లో ఉండటం అనేది ప్రాకృత అవస్థ గా గ్రహించాలి. ప్రతి నిత్యం కొన్ని వెంట్రుకలు ఊడి పోయిన కూడా ఆందోళన చెందనవసరం లేదు.

సాధారణంగా జుట్టు ఉన్న వారికి అంత ఎక్కువగా ఇబ్బందులు ఉండవు. ఎలాంటి సమస్యలు లేని వారికి మురికి, జిడ్డు త్వరగా వదిలి పోతుంది. కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. వెంట్రుకలు పట్టు కుచ్చులా మెరుస్తాయి. జిడ్డు కారే తత్వం కల వెంట్రుకలు ఎప్పుడూ జిడ్డోడుతూ ఉంటాయి. కనుక తరచూ తల స్నానం చేయాలి.

ఎందుకు అంటే తలలో నూనె గ్రంధులు ఎక్కువగా ఉండటం వలన వెంట్రుకలు ఎప్పుడూ జిడ్డు కారుతూ ఉంటాయి. ఒత్తిడి, ఎండలో తిరగడం, ఎక్కువగా దువ్వడం, కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన వెంట్రుకలు జిడ్డు కారుతూ ఉంటాయి.

దీనికి పరిష్కారం నూనె పదార్థాలు తక్కువగా తీసుకోవడం, తాజా కూర కాయలు, పళ్ళు తీసుకోవడం, ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు నీరు తప్పకుండా త్రాగడం, ఘాటుగా లేని షాంపూ వాడటం.

పొడి జుట్టు జీవం లేకుండా ఉండి ఎంత షాంపూ చేసిన గడ్డి లా ఎండి పోయినట్లు కనిపిస్తుంది. పొడి జుట్టు కుదుళ్ళు సన్నగా ఉండి చివర్లు ఎక్కువగా చిట్లడం జరుగుతుంది. నూనె గ్రంధులు తక్కువగా ఉండటం వల్ల కూడా జుట్టు ఎక్కువగా పొడి బారుతుంది. ఎక్కువ సార్లు షాంపూ చేయడం, డ్రయర్ ఎక్కువగా వాడటం, ఎండలో తిరగడం ఈ కారణాల వలన వెంట్రుకలు లో మృదుత్వం పోతుంది.

జుట్టు ఎక్కువగా రాలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:-

తల, వెంట్రుకలు ఎక్కువ సార్లు దువ్వడం చేయకూడదు.

ఎక్కువ సార్లు షాంపూ లతో స్నానం చేయకూడదు.

చర్మం లో ఎక్కువ నూనె శాతం కల వారు నూనెను తలకు ఎక్కువగా రాయ కూడదు. తినే ఆహారంలో కూడా నూనె వాడకం తగ్గించాలి.

ఆయుర్వేద వైద్య శాస్త్రం లో తెలిపిన లేపాలు మరియు తైలాల తో మృదువుగా శిరస్సు పై మర్దన చేయాలి.

Tips:-

  • వాకుడు లేదా ములక యొక్క పండు లేదా వేరు రసాన్ని తేనె తో కలిపి వెంట్రుకల పై రాస్తే పేను కొరుకుడు నశిస్తుంది.
  • గురువింద గింజ లేదా వేరు పొడిని నీటిలో కలిపి పైకి రాస్తే పేను కొరుకుడు నశించి వెంట్రుకలు మొలుస్తాయి.
  • నల్ల జీడి గింజ రసాన్ని పూస్తే వెంట్రుకలు మొలుస్తాయి. తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. ఈ ద్రవ్యం పడక పోతే వారిలో దురదలు, దద్దుర్లు వస్తాయి. అలాంటపుడు రసాన్ని పూయడం ఆపి వేసి కొబ్బరి నూనె పూస్తే వచ్చిన ఉప ద్రవాలు, దురదలు తగ్గుతాయి.
  • తెల్లని గుర్రపు గిట్టలను ముక్కలు గా చీల్చి కాల్చి మసి చేసి వెన్న లో కలిపి లేపము చేయుట వలన వెంట్రుకలు మొలుస్తాయి.
  • ఏనుగు దంతాన్ని కాల్చి మసి చేసి పాలలో కలిపి నూరి పైకి రాస్తే వెంట్రుకలు మొలుస్తాయి. దీనినే హస్తిదంతామసీ అని అంటారు. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధ మైన యోగం.
  • మందార పువ్వులను ముద్ద గా నూరి నువ్వుల నూనె లో కాచి కొద్ది రోజుల వరకు పైకి పూస్తే చుండ్రు నశించి వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
  • మిరియాలు మాడు పైన వేసి రుద్దితే కొత్త వెంట్రుకలు మొలుస్తాయి.
  • ఉసిరిక వేరు, మర్రి ఊడలు, జటామాంసిలను కలిపి నూరి పైకి పూస్తే వెంట్రుకలు వృద్ధి చెందుతాయి.

Post Disclaimer

This information on this blog is designed for educational purpose only. It is not intended to take care or medical advice. You should not use this information to treat any health issues. Please consult a doctor or physician with any questions or concerns you have regarding your condition.

ఈ బ్లాగులోని వివరాలు విద్యా ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది సంరక్షణ లేదా వైద్య సలహా తీసుకోవటానికి మాత్రం ఉద్దేశించినది కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించకూడదు. దయచేసి మీ పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న లేదా ఆందోళన ఉన్న వైద్యుడిని సంప్రదించండి.